
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్ నగర్ అసెంబ్లీ టికెట్ బీసీలకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ బీసీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు ఆదివారం డీసీసీ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ జనాభా 80 శాతం జనాభా ఉందని, అందుకని బీసీ నాయకుడికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలప్పుడే చుట్టపు చూపుగా వచ్చిపోయే నాయకుడికి టికెట్ ఇవ్వొద్దని, స్థానికంగా ఉండే బీసీ నాయకుడికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం డీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తూరు చంద్రకుమార్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు.