ప్రగతి భవన్ కు ఇతర రాష్ట్రాల రైతు సంఘాల నేతలు

 ప్రగతి భవన్ కు ఇతర రాష్ట్రాల రైతు సంఘాల నేతలు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయాభివృద్ధి విధానాలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తామని పలు రాష్ట్రాల రైతు సంఘాల నేతలన్నారు. దేశంలో నెలకొన్న వ్యసాయ రంగ పరిస్థితులతో పాటు..  తెలంగాణలో వ్యవసాయ, సాగునీటి రంగ అభివృద్ధిని పరిశీలించేందుకు 25 రాష్ట్రాల రైతు సంఘాల ప్రతినిధులు కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం, సాగునీటి రంగం, తెలంగాణ ప్రగతి పై రూపొందించిన డాక్యుమెంటరీని వారు వీక్షించనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే రైతు  సదస్సులో వారు పాల్గొననున్నారు. వీరితో సీఎం కేసీఆర్ మధ్యాహ్నం లంచ్ చేస్తారు. అనంతరం తిరిగి సదస్సు కొనసాగనుంది.