ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి ఇంట విషాదం నెలకొంది. మమ్ముట్టి చెల్లెలు అమీనా(70) కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆమె సెప్టెంబర్ 12న తుదిశ్వాస విడిచారు. అమీనాకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు మమ్ముట్టి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు.
2023ఏప్రిల్ 21 న మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ మరణించారు. ఇపుడు చెల్లి అమీనా కూడా కన్నుమూయడంతో మమ్ముట్టి ఫ్యామిలీ తీవ్ర విషాదంలో ఉంది. సెప్టెంబర్ 7న మమ్ముట్టి 72 వ పుట్టిన రోజు జరుపుకున్నారు. మమ్ముట్టికి సౌదా, షఫీనా అనే మరో ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు.
దాదాపు ఐదు దశాబ్దాలుగా మలయాళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా మమ్ముట్టి కొనసాగుతున్నారు. తెలుగులో స్వాతి కిరణం, యాత్ర వంటి చిత్రాలతో, మరెన్నో డబ్బింగ్ సినిమాలతో పాప్యులారిటీ తెచ్చుకున్నారు. ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్ కూడా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే.