![వందే భారత్లో ఎల్ఎల్సీ ట్రోఫీ టూర్](https://static.v6velugu.com/uploads/2023/11/vande-bharat-express_3jPsSxETMu.jpg)
న్యూఢిల్లీ: వెటరన్ క్రికెటర్లు బరిలో నిలిచిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ) రెండో ఎడిషన్కు సిద్ధం అవుతోంది. ఈ నెల 18 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు రాంచీ, డెహ్రాడూన్, జమ్మూ, వైజాగ్, సూరత్ నగరాల్లో జరిగే లీగ్లో అర్బన్ రైజర్స్ హైదరాబాద్ సహా ఆరు జట్లు బరిలో నిలిచాయి. రెండో సీజన్కు ప్రచారం కల్పించడంతో పాటు ఇండియాలో ఆటలను ప్రోత్సహించేందుకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఎల్ఎల్సీ ట్రోఫీ టూర్ నిర్వహిస్తామని ఆర్గనైజర్స్ ప్రకటించారు. బుధవారం నుంచి 15 రోజుల పాటు 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగే ట్రోఫీ టూర్లో క్రిస్ గేల్, వాట్సన్, గంభీర్ తదితర క్రికెటర్లతో పాటు దేశంలోని ఇతర క్రీడా ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.