గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి

మహబూబ్‎నగర్: చౌదరపల్లి సమీపంలో హైవే 167పై చిరుతపులి మృతిచెందింది. చిరుత రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో చిరుత తలకు గాయం కావడంతో అక్కడికక్కడే చనిపోయింది. వాహనదారుల సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గద్దెగూడెం గుట్టల వైపు నుంచి మన్యంకొండ గుట్టల వైపు చిరుత క్రాస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఫారెస్ట్ అధికారుల నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.