శంషాబాద్, వెలుగు: శంషాబాద్లోని స్వర్ణ భారత్ ట్రస్టులో మంగళవారం ఉగాది సంబురాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. జ్యోతి వెలిగించి ఉగాది సంబరాలను ప్రారంభించారు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. భారత్ త్వరలోనే సూపర్ పవర్ గా ఎదగాలని, దీని కోసం ప్రతి ఒక్కరు తమవంతు కృషిని నిర్వర్తించాలని సూచించారు. భారత్ ప్రబల శక్తిగా అవతరించడానికి ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలని అన్నారు. గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాదిని తమిళనాడులోనూ జరుపుకుంటారని.. అయితే కొత్త సంవత్సరంలా కాదని, ఆ రోజు గ్రామ దేవతలను పూజించి తీర్థం తీసుకుంటారని చెప్పారు. అనంతరం పండితులు పంచాంగ శ్రవణం చేశారు. తర్వాత స్వర్ణభారత్ ట్రస్టులో పలు అంశాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ చిగురుపాటి కృష్ణప్రసాద్ ట్రస్ట్ సాధించిన ఫలితాలను వివరించారు.
భారత్ సూపర్ పవర్గా ఎదగాలె : వెంకయ్య నాయుడు
- హైదరాబాద్
- April 10, 2024
లేటెస్ట్
- T20 World Cup 2024: ఆ ఒక్క కారణంతోనే రాహుల్ను ఎంపిక చేయలేదు: అజిత్ అగార్కర్
- నా కూతురు కోవిషీల్డ్ వాక్సిన్తో చనిపోయింది.. కోర్టుకెక్కిన తండ్రి
- Salaar Release Japan: జపాన్లో రిలీజ్ కాబోతున్న సలార్..ప్రభాస్ ఫ్యాన్స్కి వేడి సెగలిక మొదలు
- మెట్రో పిల్లర్ ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి
- పట్నం బస్తీల్లో.. ఢిల్లీ పోలీసులు
- రుణమాఫీని మోదీ ఆపాడు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- V6 DIGITAL 02.05.2024 EVENING EDITION
- ప్రచారానికి ముందు.. పుణ్యస్నానం ఆచరించిన CM
- చంద్రబాబుకు రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా... సజ్జల
- మే 4 వరూధిని ఏకాదశి.... సిరి సంపదలు.. విష్ణుమూర్తి కటాక్షం
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో తగ్గుదల.. ఏంటి ఈ అనూహ్య మార్పు!
- Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. ఐకానిక్ స్టేడియంలో మ్యాచ్లు!
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- తెలంగాణ గొంతుక కేసీఆర్ గొంతుపైనే నిషేధమా? : కేటీఆర్
- Ben Wells: అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే క్రికెట్కు గుడ్ బై
- అలర్ట్: గ్రూప్ 1 ఎగ్జామ్పై TSPSC కీలక ప్రకటన