సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు

సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు

సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ను రద్దు చేశారు ఎక్సైజ్ పోలీసులు.  2024 ఏప్రిల్ 2న ఊర్వశి బార్లో అశ్లీల నృత్యాలు చేస్తుండగా 108 మందిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై  బేగంపేట్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. 30 మంది అమ్మాయిలతో పాటు 70 మంది కస్టమర్లతో పాటుగా 8 మంది బార్ సిబ్బందిని పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 

కస్టమర్లను ఆకర్షించేందుకు అమ్మాయిలతో అశ్లీల డ్యాన్సులు చేయించింది బార్ యజమాన్యం. దీంతో  బార్ యజమాన్యంపై కేసు నమోదు చేసి లైసెన్స్ రద్దు చేయించారు పోలీసులు.  గతంలో లేట్ నైట్ వరకు రన్ చేయడమే కాకుండా  రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో  ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ పై దాడులు చేశారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.