లాక్ డౌన్ కష్టాలు కేంద్ర మంత్రికి కూడా తప్పలేదు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి తన తల్లి అండాలమ్మ ప్రథమ వర్థంతిని సోమవారం(ఇవాళ) స్వగ్రామం రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో చేయాల్సి ఉంది. అయితే మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోనే ఉండడం.. లాక్డౌన్ కారణంగా స్వగ్రామానికి రాలేకపోయారు. దీంతో భార్యా పిల్లలు, తోబుట్టువులు తిమ్మాపూర్లో, కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసం నుంచి ఆన్లైన్ ద్వారా తల్లి వర్థంతిని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
కరోనా పర్యవేక్షణ బాధ్యతలతో గత నెల రోజులుగా ఢిల్లీ లోనే ఉన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.