ఆర్టికల్ 370 తీర్మాణంపై లోక్ సభలో వాడివేడిగా చర్చ  

ఆర్టికల్ 370 తీర్మాణంపై లోక్ సభలో వాడివేడిగా చర్చ  

న్యూఢిల్లీ:  ఆర్టికల్ 370కి సంబంధించి లోక్ సభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. కశ్మీర్ అంశం ద్వైపాక్షిక వివాదం..అంతర్గత విషయం ఎలా అవుతుందని అధిర్ రంజన్ చౌదరి ప్రశ్నించగా..జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమని  చెప్పారు అమిత్ షా.

NDA ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా జమ్ముకశ్మీర్‌ లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగిన క్రమంలో ఐక్యరాజసమితి స్పందించింది. కశ్మీర్‌ లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై ఆరా తీస్తున్నామని US అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. ఆర్టికల్ 370 విసయంలో భారత్, పాకిస్థాన్ దేశాలు సంయమనం పాటించాలని ఐక్యరాజసమితి కోరింది.