రజినీకాంత్ 171 నుండి తప్పుకోనున్న లోకేష్ కనగరాజ్

రజినీకాంత్ 171 నుండి తప్పుకోనున్న లోకేష్ కనగరాజ్

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. రజిని, లోకేష్(Lokesh) కాంబో క్యాన్సిల్ అయ్యింది. ప్రస్తుతం ఈ న్యూస్ తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ న్యూస్ విని రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా అవాక్కవుతున్నారు. నిజానికి ఈ కాంబో కోసం తలైవా ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. తాజా న్యూస్ తో వాళ్ల ఆశలపై నీళ్లు చెల్లినట్టైంది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. రీసెంట్ గా జైలర్ సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రజినీకాంత్.. తన తరువాత సినిమాను జై భీమ్ దర్శకుడు టీజీ జ్ఞానవేల్ తో చేయనున్నారు. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. 

అయితే ఈ సినిమా తరువాత రజిని తన 171వ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తో చేస్తారని వార్తలు వినిపించాయి. ఈ ప్రాజెక్టు కోసం రజినిని కూడా కలిశారు లోకేష్. దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ న్యూస్ తో రజిని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కమల్ కు విక్రమ్ లా.. రజిని కి కూడా అదిరిపోయే మాస్ మూవీ ఇస్తారని అనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. .

ALSOREAD:త్రిషకి లిప్​లాక్​ ఇవ్వలేనన్న విజయ్..ఎందుకో తెలుసా?

దానికి కారణం.. లోకేశ్‌ ఈ సినిమాలో రజినీకాంత్‌ను స్నిపర్‌ సీన్స్ షాట్ సీన్ చెప్పాడట. కానీ.. అలాంటి సీన్స్ నెల్సన్‌ జైలర్‌ సినిమాలో చూపించేశాడు. అందుకే ఆ సీన్స్ మార్చి కొత్త కథ రాయాలని అనుకుంటున్నాడట. అందుకే ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడట లోకేష్. ఇక ఇదే విషయంపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.