కార్తీక మాసంలో శివుడిని ఈ పూలతోనే పూజించాలి.. ప్రత్యేకతలు ఇవే

కార్తీక మాసంలో శివుడిని ఈ పూలతోనే పూజించాలి.. ప్రత్యేకతలు ఇవే

Karthika Masam : కార్తీకమాసం పూజల మాసం.  ఈ మాసంలో ఓ పక్క శివుడిని.. మరో పక్క విష్ణు భగవానుడిని కూడా పూజిస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కోలా పూజిస్తుంటారు.  కొంతమంది ఇంట్లో అర్చిస్తే.. మరికొంతమంది దేవాలయాలకు వెళ్లి దర్శనం చేసుకొని అక్కడ పూజలు చేస్తుంటారు. దేవాలయానికి వెళ్లేటప్పుడో... ఇంట్లో పూజ చేసేటప్పుడో.. మీ పరిసర ప్రాంతంలోని పూలు తెచ్చుకొని అర్చిస్తారు.  ఓ మూడు రకాల పూలతో పూజిస్తే  అష్ట కష్టాలు తొలగిపోతాయని స్కంద పురాణంలో  రుషి పుంగవులు పేర్కొన్నారు.  ఈ మూడు రకాల పూలేంటి?  వాటి వెనకున్నటువంటి రహస్యాలు ఏంటి? ఈ పూలతో పూజిస్తే మీకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో.. ఇప్పుడు మనం తెలుసుకుందాం… 

కార్తీక మాసంలో ఈ మూడు రకాల పువ్వులలో ఏ ఒక్కటి దొరికినా సరే మీ పంట పండినట్లేనని పండితులు అంటున్నారు. ఈ మూడు రకాల పువ్వులతో ఆ నారాయుని గనక మీరు పూజిస్తే మీకు అష్ట కష్టాలు తొలగిపోతాయట. 

వేదములతో సమానమైన శాస్త్రము ఏదీ లేదు అంటారు. గంగానది వంటి ఇతర నది ఉండదు. శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం లాంటి మాసం మరొకటి ఉండదు. ఈ మాసంలో భక్తులంతా  శంకరుని నిత్యం నామస్మరణ చేస్తూ ఉంటారు. లక్ష్మీనారాయణ ఆశీర్వాద లభిస్తుంది అంటారు. మూడు రకాల పువ్వుతో ఈ కార్తీకమాసంలో ఏదో ఒక రోజు ఆ లక్ష్మీనారాయణ కనుక ఆరాధిస్తే అనేక కష్టాల నుంచి విముక్తి కలగటమే కాదు.. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది.

సాధారణంగా ప్రతి పూజకి పువ్వులు ఎంతో అవసరం.మనం ఏ భగవంతుని ఆరాధిస్తున్నాము ఆ భగవంతునికి ఇష్టమైన పువ్వులేంటో తెలుసుకుని ఆరాధిస్తే  మన కోరికలు త్వరగా తీరుతాయి. మనం ఆరాధించే  భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తారు. శ్రీమహావిష్ణువుకి ఇష్టమైనటువంటి పువ్వుల గురించి మనం తెలుసుకోవాలి. వాటిల్లో పారిజాత పువ్వు ముందు వరసలో ఉంటుంది. పారిజాత పుష్పాలతో అందరి దేవుళ్ళకి పూజలు చేయొచ్చు. ఈ పారిజాతం శ్రీ మహా విష్ణుకి ఎంతో ఇష్టమైనటువంటి మాసం. ముఖ్యంగా శ్రీమహావిష్ణువుని తెలుపు రంగులో ఉన్నటువంటి పారిజాతాలతో పూజలు చేయాలి అంటారు. పారిజాతాన్ని చెట్టు నుంచి కోయకూడదు. ఇది ఆ వృక్షానికి ఉన్నటువంటి గొప్ప వరం.. ఎవరింట్లో అయితే పారిజాత వృక్షం ఉంటుందో ఆ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. ఆ పూల వాసన ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని అందిస్తుంది.

శ్రీమహావిష్ణువుని కార్తీక మాసంలో  పారిజాతాలతో ఆరాధిస్తే మీకు ఆ విష్ణు భగవానుని  అనుగ్రహం ఉంటుంది. పారిజాతాలతో పాటు శ్రీమహావిష్ణువు కార్తీక మాసంలో ఆరాధించాల్సినటువంటి మరొక పువ్వు శంకు పుష్పం. ఇది నీలిరంగులో ఉంటుంది. ఈ శంఖ పుష్పం అనేది దేవుడి పూజకి ఎంతో పవిత్రం విష్ణు ప్రాంత వృక్షానికి చెందినది. ఈ పువ్వు దీన్ని సంస్కృతంలో గిరికర్నిక అంటారు. ఎంతో పవిత్రంగా భావిస్తారు.

ఇది శంకువ ఆకారంలో ఉంటుంది. కాబట్టి దీన్ని శంకు పుష్పం అంటారు. ఈ పువ్వులను ఉపయోగించి శ్రీమహావిష్ణువును.. కార్తీకమాసంలో ఆరాధిస్తే పితృ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఈ శంకు పుష్పం ఆరోగ్య ప్రయోజనాలను కూడా మెండుగా కలిగి ఉంది. శంకు పూలు ఆకులు , వేళ్ళతో చేసిన పొడి జ్ఞాపకశక్తిని పెంచడంతోపాటు వయసు పెరిగే కొద్దీ వచ్చేటువంటి అనారోగ్యం నుంచి కూడా రక్షిస్తుంది.

అలాగే పారిజాతాలు శంకు పుష్పాలతో పాటు శ్రీమహావిష్ణువుకి ఇష్టమైనటువంటి పువ్వులు పుండరీకాలు వీటిని తెల్ల కలువలు అంటారు. సాధారణంగా ఎరుపు రంగులో ఉండేటువంటి తామర పువ్వులు మనకి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పువ్వులుగా భావిస్తారు. తెలుపు రంగులో ఉండేటువంటి తామరలు శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టం. ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. దొరికితే మాత్రం తప్పకుండా సేకరించండి. ఈ తెల్లటి తామరలతో శ్రీమహావిష్ణువుని ఆరాధిస్తే మీకు మేలు కలుగుతుంది. మీరు చేసేటువంటి పనుల్లో విజయం వరిస్తుంది…