బైకును ఢీకొన్న లారీ.. రెండు ముక్కలైన యువకుడి శరీరం

బైకును ఢీకొన్న లారీ.. రెండు ముక్కలైన యువకుడి శరీరం

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బైపాస్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక బైకిస్ట్ రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న యువకుడి శరీర అవయవాలు ఛిద్రమయ్యాయి. ఒక కాలు శరీరం నుండి విడిపోగా.. పొట్ట భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన అనంతరం లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.