ఆగి ఉన్న కారును లారీ ఢీ కొట్టిన సంఘటన మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సెయింట్ ఆన్స్ స్కూల్ ఎదుట జరిగింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ గాయపడ్డాడు. చింతల్ నుండి హాయత్ నగర్ వెళ్తున్న ఓ లారీ.. శనివారం తెల్లవారుజామున రోడ్డు మీద ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. దీంతో కారు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారు డ్రైవర్ గోవర్ధన్ కు గాయాలు కావడంతో అతని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు
లారీ డ్రైవర్ (యాదయ్య) నిద్ర మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, అంతకుముందు ఫుట్ పాత్ లపై ఉన్న దుకాణాలను కూడా లారీతో ధ్వంసం చేశాడని పోలీసులు తెలిపారు. వాహనాన్ని ఢీ కొట్టిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడని, అతనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.