పక్కపక్కనే ఇండ్లు.. లవ్లో ఉన్నారు.. భువనగిరిలో రైలు పట్టాలపై.. ప్రాణాలు తీసుకున్నరు

పక్కపక్కనే ఇండ్లు.. లవ్లో ఉన్నారు.. భువనగిరిలో రైలు పట్టాలపై.. ప్రాణాలు తీసుకున్నరు

ఇద్దరిదీ ఒకే ఊరు. పక్కపక్కనే ఇండ్లు. చిన్న నాటి నుంచి కలిసి పెరిగిన పరిచయం.. మాటలు.. మనసులు కలిశాయి.. చిన్ననాటి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ అంతలోనే ఆత్మహత్యకు పాల్పడటం భువనగిరి జిల్లాలో సంచలనంగా మారింది. 

ప్రేమికులిద్దరూ  భువనగిరి శివారులో రైలు కింద పడి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం  నెమలి కొండకు చెందిన మచ్చ శృతి(23), కే వినయ్ కుమార్(25)గా  గుర్తించారు.

ఓకే గ్రామానికి చెందిన ఇద్దరు పక్కపక్క ఇల్లు కావడంతో గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.  ప్రేమ విషయం వీరి పెద్దలకు తెలిస్తే నిరాకరిస్తారనే అనుమానంతో భువనగిరి శివారులో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఫ్లైఓవర్ కింద సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు రైల్వే పోలీసులు. కేసు నమోదు చేసి పంచనామ నిర్వహించి జల్లా ఆస్పత్రికి తరలించించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.