లాడ్జీలో లవర్స్ సూసైడ్.. ఇద్దరూ సచివాలయ ఉద్యోగులే

లాడ్జీలో లవర్స్ సూసైడ్.. ఇద్దరూ సచివాలయ ఉద్యోగులే

నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆ యువతి యువకుడు ఇద్దరూ గ్రామ సచివాలయ ఉద్యోగులు. కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే పెద్దలు తమ ప్రేమకు ఒప్పుకోరు అని భావించారో ఏమో.. కానీ.. ఇద్దరూ సూసైడ్ చేసుకొని చనిపోయారు. పడారుపల్లి మండలంలోని మెట్టు గ్రామంలో హరీష్, లావణ్యలు గ్రామ సచివాలయ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ప్రేమికులు. వీరు శుక్రవారం పడారుపల్లిలోని నందా లాడ్జీలో అద్దెకు దిగారు. శనివారం ఉదయం ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో లాడ్జీ సిబ్బంది.. గది తలుపులు తెరిచి చూశారు. ఊహించని విధంగా గదిలో హరీష్, లావణ్యలు తాడుతో ఉరివేసుకొని చనిపోయారు. వెంటనే లాడ్జీ యాజమాన్యం స్థానిక పోలీసులకు సమాచారమందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వీరి ఆత్మహత్యకు గల కారణాలు వెతికే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు చనిపోవడంతో.. మృతుల కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి.

For More News..

డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. అయిదుగురికి తీవ్ర గాయాలు

టెన్త్ అర్హతతో పోస్టల్​ జాబ్స్​.. రోజుకు నాలుగు గంటలే డ్యూటీ