హైదరాబాద్, వెలుగు: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను బలోపేతం చేయడంలో భాగంగా తెలంగాణలోని 13 జిల్లాలకు తమ సేవలను విస్తారిస్తామని లఘు ఉద్యోగ్ భారతి (ఎల్యూబీ) ప్రకటించింది.
హైదరాబాద్లో సంస్థ అఖిల భారత అధ్యక్షుడు మధుసూదన్ మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్యప్రణాళికను మార్చేందుకు ఐటీఐలతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ఐఐసీటీ వద్ద సిద్ధంగా ఉన్న 2,600లకు పైగా టెక్నాలజీలను ఎంఎస్ఎంఈలకు అనుసంధానం చేయడం ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.

