ఎన్టీఆర్ చేతుల మీదుగా మ్యాడ్ ట్రైలర్.. నవ్వులతో మరో హ్యాపీడేస్

ఎన్టీఆర్ చేతుల మీదుగా మ్యాడ్ ట్రైలర్.. నవ్వులతో మరో హ్యాపీడేస్

ఎన్టీఆర్(NTR) బావమరిది నార్నే నితిన్(Narne Nithin) హీరోగా, కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మ్యాడ్(Mad)’. హారికా అండ్ హాసినీ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కూతురు హారిక ఈ చిత్రంతో ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌గా పరిచయమవుతోంది. సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 

లేటెస్ట్గా మ్యాడ్ ట్రైలర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. కాలేజ్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో జరిగే గొడవలు, ర్యాగింగ్, ఫ్రెండ్‌‌‌‌షిప్‌‌‌‌, లవ్ లాంటి అంశాల చుట్టూ తిరిగే యూత్‌‌‌‌ఫుల్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌ లా ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ట్రైలర్ లో యూత్ డైలాగ్స్ భలే అనిపిస్తున్నాయి..ఏసీ ప‌నిచేస్త‌లేదు మావ అని అనగా..నీళ్లు పోయ‌లేదేమో.. అంటూ మ‌రో స్టూడెంట్ స‌మాధానం ఇవ్వ‌డం న‌వ్వుల‌ను పూయిస్తుంది.

సూప‌ర్ కాలేజీ...గ్రేట్ ఫ్యాక‌ల్టీ...హండ్రెడ్ ప‌ర్సెంట్ ప్లేస్‌మెంట్‌...గొప్ప‌గొప్ప‌వాళ్లంద‌రూ ఇక్క‌డే చ‌దివారు...నేను కూడా ఇక్క‌డే చ‌దివాను.. అని కాలేజీ వాచ్‌మెన్ చెప్పిన డైలాగ్ భలే ఆకట్టుకుంటోంది. వెంటనే కమెడియాన్ రఘుబాబు మాట్లాడుతూ..ఒక్క చదువుకునే పేస్ ఉందా ఇందులో అని స్టూడెంట్స్ ను చూపించే సీన్ క్రేజీ గా ఉంది. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ట్రైలర్ ను బాగా ఎంజాయ్ చేశానని..ఫుల్ సినిమా చూసేందుకు ఎంతో వెయిట్ చేస్తున్నాని ఎన్టీఆర్ తెలుపగా..టీమ్ అంత ఎన్టీఆర్ కు థాంక్స్ చెప్పారు.  

బలగం,ధమాకా మూవీకి అదిరిపోయే సాంగ్స్ ఇచ్చిన భీమ్స్ సిసిరోలియో మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ శంక‌ర్ రాసుకున్న స్టోరీ కరెక్ట్ గా సెట్ అయితే పక్కా హిట్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు సినీ ఆడియన్స్. అలాగే ట్రైల‌ర్‌లో డైరెక్ట‌ర్ అనుదీప్ గెస్ట్ రోల్ చేయడం విశేషం. ఈ మూవీ అక్టోబర్ 6న థియాటర్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.  

నార్నే నితిన్ సినిమాల విషయానికి వస్తే..శ్రీశ్రీశ్రీ రాజావారు మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడనే సంగతి తెలిసిందే. ఇక ఈ ఫ‌స్ట్ మూవీ రిలీజ్ కాకుండానే మ్యాడ్ మూవీ వస్తుండటంతో..నార్నే నితిన్ పై ఫోకస్ పడింది.ఈ సినిమాకు స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అలాగే గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో నార్నేనితిన్ మరో మూవీ చేయ‌బోతున్నాడు. 

మ్యాడ్ మూవీని ప్రొడ్యూసర్ నాగవంశీ ప్రెజెంట్ చేస్తుండగా..త్రివిక్రమ్ భార్య  సాయి సౌజన్య కో ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు