ఆశ్చర్యపరిచేలా ముత్తయ్య మురళీధరన్ బయోపిక్

ఆశ్చర్యపరిచేలా  ముత్తయ్య  మురళీధరన్ బయోపిక్

 శ్రీలంక క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముత్తయ్య మురళీధరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీవితం ఆధారంగా ఎం.ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. శ్రీపతి రూపొందించిన చిత్రం ‘800’. మధుర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిట్టల్, మహిమా నంబియార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జంటగా నటించారు. వివేక్ రంగాచారి నిర్మించిన ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణ ప్రసాద్  పాన్ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 6న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘దర్శకుడు శ్రీపతి నాకు ఎప్పట్నుంచో పరిచయం. 

ఆగస్టులో తను ఫోన్ చేసి  మురళీధరన్ బయోపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓవర్ టేక్ చేసుకోవాలని చెప్పాడు. అంతకంటే ముందు ఈ సినిమా షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి సంబంధించి అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్ని చెప్పేవాడు.  ఈ బయోపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దగ్గరగా తీశారు. అలాగని  డాక్యుమెంటరీలా ఉండదు. ఒక మనిషి జీవితం ఇలా ఉంటుందా? ఎన్ని అవరోధాలు ఎదుర్కొని ఆయన ఈ స్థాయికి చేరుకున్నారా? అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా, తెరపై సన్నివేశాలు అలా చూస్తూ ఉండేలా సినిమా ఉంటుంది. 

విజయ్ సేతుపతి తప్పుకోవడంతో నానితో ఈ సినిమా చేయాలనుకున్నాడు శ్రీపతి. అయితే నాని అప్పటికే ‘జెర్సీ’ చేసి ఉండటంతో ఇది చేయలేనని అన్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చిన  సచిన్, గంగూలీ, లక్ష్మణ్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ క్రికెటర్లను కలవడం మెమరబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంది. ఇండియాలో సుమారు 1100 థియేటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’ అని చెప్పారు.