కేబుల్​బ్రిడ్జిపై రూల్స్ మాకు కాదు.. వివాదంలో ముగ్గురు ఇన్ స్పెక్టర్లు

కేబుల్​బ్రిడ్జిపై రూల్స్ మాకు కాదు.. వివాదంలో ముగ్గురు ఇన్ స్పెక్టర్లు

మాదాపూర్, వెలుగు: మాదాపూర్​ఇన్​స్పెక్టర్ గడ్డం మల్లేశ్ తో పాటు పటాన్ చెరు ట్రాఫిక్, రాజేంద్రనగర్​ సీసీఎస్ ఇన్ స్పెక్టర్లు శ్రవణ్, సంజయ్ వివాదంలో చిక్కుకున్నారు. దుర్గం చెరువు కేబుల్​బ్రిడ్జిపై వరుస ప్రమాదాలు జరుగుతుండడంతో..  ఇక్కడ బర్త్ డే వేడుకలు, సెల్ఫీలు, వాహనాలు నిలపడం చేస్తే జరిమానాతోపాటు శిక్షకు అర్హులని గతంలో పోలీసులు​ ప్రకటించారు.

 ఆ మేరకు మాదాపూర్ ఇన్ స్పెక్టర్ అవగాహన కూడా కల్పించారు. అయితే, ఇదే కేబుల్ ​బ్రిడ్జిపై ఏప్రిల్ 20 అర్ధరాత్రి జరిగిన బర్త్​డే వేడుకల్లో ఈ ముగ్గురు ఇన్​స్పెక్టర్లు పాల్గొని రూల్స్​ను బ్రేక్​చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. రూల్స్​సామాన్య ప్రజలకు మాత్రమేనా.. పోలీసులకు వర్తించవా? అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని మాదాపూర్​జోన్ ​డీసీపీ వినీత్​ను సైబరాబాద్ సీపీ అవినాష్​ మహంతి ఆదేశించారు.  నివేదిక అనంతరం ఇన్​స్పెక్టర్లపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.