మాధవన్ కొడుకుపై ప్రశంసల వెల్లువ

మాధవన్ కొడుకుపై ప్రశంసల వెల్లువ

మాధవన్ కొడుకు వేధాంత్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. స్విమ్మింగ్‌లో ఇది వరకే మాధవన్ కొడుకు దేశానికి పతకాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి స్విమ్మింగ్ పోటీల్లో దేశానికి సిల్వర్ మెడల్‌ను సాధించి పెట్టాడు.  డేనిష్ ఓపెన్ 2022లో మాధవన్ కొడుకు వేదాంత్‌కు వెండి పతకం లభించింది. ఈ విషయాన్ని మాధవన్ సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించాడు.మాధవన్ తన కొడుకు ఫోటోను మాత్రమే కాకుండా మొదట వచ్చి బంగారు పతకాన్ని సాధించిన వ్యక్తిపేరు కూడా చెప్పేశాడు. ఇద్దరి ఫోటోలను షేర్ చేశాడు. భారతదేశానికి సాజన్ ప్రకాష్ బంగారు పతకాన్ని, వేదాంత్ మాధవన్ సిల్వర్ పతకాన్ని సాధించారు.. ఇదంతా మీ (అభిమానులు) అందరి ప్రేమ, ఆశీర్వాదాల వల్లే జరిగింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ నేపథ్యంలోనే గురువైన ప్రదీప్‌కు థ్యాంక్స్ చెప్పాడు మాధవన్. స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి కూడా మాధవన్ థ్యాంక్స్ చెప్పేశాడు. దీంతో వేధాంత్‌ పై మరోసారి ట్వీట్స్ చేస్తున్నారు. మాధవన్ తన కొడుకుని ఎంత పద్దతిగా పెంచాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.  వారసులు అంటే ఇలా ఉండాలి.. కొడుకు ఇష్టాన్ని గౌరవిస్తూ ప్రోత్సహిస్తున్నాడు అంటూ మాధవన్ మీద నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.