మధ్యప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. 16వ ప్రసవంలో తల్లీ బిడ్డ మృతి చెందారు. మధ్యప్రదేశ్లోని దామో జిల్లాలో 45 ఏళ్ల మహిళ అహిర్వర్ తన 16 వ బిడ్డకు జన్మనిచ్చింది. కాని వారిద్దరూ వెంటనే మరణించారని డాక్టర్లు తెలిపారు. జిల్లాలోని పదాజిర్ గ్రామానికి చెందిన సుఖ్రానీ అహిర్వార్ అనే మహిళ ఇంట్లో పసికందును ప్రసవించిందని ఆశా వర్కర్ కల్లో బాయి తెలిపింది.
అయితే, మహిళ మరియు ఆమె నవజాత శిశువు యొక్క పరిస్థితి విషమించడంతో అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారిద్దరు ఆస్పత్రిలో మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. డాక్టర్లు తెలిపిన ప్రకారం అహిర్వర్ ఇంతకుముందు 15 మంది పిల్లలకు జన్మనిచ్చింది . అయితే, వారిలో ఏడుగురు మరణించారని జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సంగీత త్రివేది ధృవీకరించారు