తమిళనాడులో వైన్ షాపులు ఓపెన్ అయిన ఒక్క రోజులోనే మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. రాష్ట్రంలో అన్ని లిక్కర్ షాపులు క్లోజ్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నేరుగా వచ్చి షాపుల్లో ఎవరూ కొనుగోలు చేయడానికి లేదని, ఆన్ లైన్ సేల్స్ మాత్రమే చేసుకోవచ్చని స్పష్టం చేసింది. లిక్కర్ షాపుల దగ్గర జనం గుంపులుగా చేరడం, సోషల్ డిస్టెన్స్ నిబంధనలను ఎవరూ పాటించకపోవడంతో కోర్టు ఈ ఆదేశాలను ఇచ్చింది. లిక్కర్ అనేది ఎసెన్షియల్ వస్తువు కాదని, దేశ వ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ విధించిన మే 17 వరకు వైన్ షాపులను మూసేయాలని న్యాయస్థానంలో ఆదేశించింది.
రెండ్రోజుల క్రితం కండిషన్స్ తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టు…
తమిళనాడులో ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తుంది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టస్మాక్) ఆధ్వర్యంలో లిక్కర్ షాపులు నడుస్తాయి. లాక్ డౌన్ కారణంగా దాదాపు నెలన్నర రోజులుగా మూతపడిన వైన్ షాపులను మే 4 నుంచి ఓపెన్ చేసేందుకు కేంద్రం ఆంక్షల సడలింపు ప్రకటించింది. అయితే తమిళనాడు ప్రభుత్వం మే 7 నుంచి షాపులను తెరుస్తామని 4వ తేదీన జీవో జారీ చేసింది. 15 శాతం లిక్కర్ రేట్లను కూడా పెంచింది. అయితే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మద్యం దుకాణాలను తెరిస్తే వైరస్ విజృంభణ ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉందంటూ మద్రాస్ హైకోర్టులో ఓ వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
More News:
లిక్కర్ సేల్ రికార్డ్.. ఒక్కరోజే రూ.172 కోట్లు
జూలై 1 నుంచి CBSE పెండింగ్ ఎగ్జామ్స్
మే 6న విచారణ చేపట్టిన న్యాయస్థానం… ఐదుగురికి మించి రాకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకోవడంతో పాటు మరికొన్ని కండిషన్స్ పెడుతూ లిక్కర్ షాపులు తెరిచేందుకు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. అయితే కోర్టు పర్యవేక్షణ కొనసాగుతుందని, సోషల్ డిస్టెన్స్ నిబంధనలను పాటించకుంటే నిర్ణయంపై సమీక్ష చేపడుతామని స్పష్టం చేసింది. అయితే గురువారం ఓపెన్ అయిన మద్యం దుకాణాల దగ్గర జనాలు గుంపులుగా చేరడంతో దీనిని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు.. లిక్కర్ షాపులను మూసేయాలని ఆదేశించింది. ఆన్ లైన్ సేల్స్ మాత్రమే చేయొచ్చని స్పష్టం చేసింది.
Madras High Court orders closure of all state-run TASMAC liquor shops in Tamil Nadu, permits only online sale of liquor pic.twitter.com/K6Tn8G69dj
— ANI (@ANI) May 8, 2020