మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే బానోతు శంకర్నాయక్కు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు అసమ్మతి లీడర్లు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావుతో గురువారం స్థానికంగా మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శంకర్నాయక్ సొంత పార్టీ లీడర్లపైనే కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. శంకర్నాయక్ను మార్చాలని, లేకపోతే తమ దారి తాము చూసుకుంటామని స్పష్టం చేశారు.
దీంతో స్పందించిన రవీందర్రావు మాట్లాడుతూ నాయకుల సమస్యలను బీఆర్ఎస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మెప్పు పొందేందుకు కొందరు పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడం తగదన్నారు.
మానుకోటలో మరో సారి బీఆర్ఎస్ జెండా ఎగురవేసేందుకు రెడీగా ఉండాలని సూచించారు. వన్యప్రాణుల సంరక్షణ కమిటీ సభ్యుడు బానోతు రవికుమార్, కేసముద్రం ఏఎంసీ మాజీ చైర్మన్ మర్రి రంగారావు, మాజీ జడ్పీటీసీ సురేందర్, సర్పంచ్ బట్టు శ్రీనివాస్, నెల్లికుదురు వైస్ ఎంపీపీ వెంకటేశ్ పాల్గొన్నారు.