మహారాష్ట్రలో లాక్‌డౌన్ పొడిగింపు

మహారాష్ట్రలో లాక్‌డౌన్ పొడిగింపు

ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. దేశంలోని కరోనా కేసుల్లో ఎక్కువగా ఈ స్టేట్ లోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడి కోసం మరిన్ని వారాల పాటు లాక్ డౌన్ పొడిగించాలని ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ నిర్ణయించింది. జూన్ 1 ఉదయం 7 గంటల వరకు లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని మహా ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రానికి వచ్చే ఇతర స్టేట్ ప్రజలు ఆర్టీ పీసీఆర్ నెగిటివ్ రిపోర్టును తప్పక సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.