కన్నీళ్లు ఆగడం లేదు..ధోని రిటైర్మెంట్ పై మహేశ్, రవితేజ

కన్నీళ్లు ఆగడం లేదు..ధోని రిటైర్మెంట్ పై మహేశ్, రవితేజ

ఇండియాకు వరల్డ్ కప్ తెచ్చిన వీరుడు, ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ పై దేశ వ్యాప్తంగా సినీ,రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరు క్రికెట్ అభిమానులు  ఉద్వేగానికి లోనవుతున్నారు.  లేటెస్ట్ గా టాలీవుడ్ టాప్ హీరోలైన సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాస్ మహారాజ రవితేజ ధోని రిటైర్మెంట్ పై ట్వీట్టర్లో పోస్ట్ చేశారు.

ధోని రిటైర్మెంట్ ప్రకటనతో తనకు కన్నీళ్లు ఆగడం లేదంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. 2011 ప్రపంచ కప్ చాంపియన్స్, వాంఖడే స్టేడియంలో ఉన్నట్టుందన్నారు. ఆ సన్నివేశాలు గుర్తుకొస్తే గర్వంగా ఉందన్నారు. ధోని కొట్టిన ఆ సిక్స్ ఎప్పటీకి మర్చిపోలేనన్నారు. క్రికెట్ ఎప్పటీకీ ఒకేలా ఉండదంటూ ట్వీట్ చేశారు మహేశ్.

ధోనీ, రైనా భారత క్రికెట్ కు అందించిన అపూర్వమైన సేవలకు ధన్యవాదాలు తెలిపారు రవితేజ. వాళ్లిద్దరి  భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరారు. లెజెండ్స్ రిటైర్ కాదు అంటూ ట్వీట్ చేశారు.