
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై థ్రిల్లర్ నుంచి తాజాగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ట్రైలర్ ను లాంచ్ చేసి టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు.
ట్రైలర్ విజయానికొస్తే.. ఒక పెద్ద కత్తితో శత్రువులను ఊచకోత కోసే సీన్ తో ట్రైలర్ మొదలౌతుంది. ‘ఊటీ నుంచి ఫోనొచ్చింది’ అనే నాగ్ వాయిస్ తో ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటన్నది రివీల్ చేశారు. అనూ.. ఆఫ్టర్ 20 ఇయర్స్.. ‘తమ్ముడిగా నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటావని నాకు మాటివ్వు’. ‘నువ్వు, నీ కూతురు బతికుండాలంటే అన్నీ వదిలేసి పారిపోండి’. ‘ఎవర్ని నమ్మాలో తెలియడం లేదు విక్రమ్’. ‘అదితీని, నిన్ను చూసుకొనే రెస్పాన్సిబిలిటీ నాది. కిడ్నాపర్స్, మర్డరర్స్, యంగ్ స్టర్స్ అండర్ వరల్డ్ మొత్తం ఒకటే అంది. స్కార్పియన్ ఎక్కడ? వీడు జస్ట్ ఏ బాడీ గార్డ్ .. ఎలా ఆపుతావ్ విక్రమ్? చావును చాలా సార్లు చాలా దగ్గరగా చూశాను ప్రియ’. అంటూ వివిధ పాత్రలు పలికే డైలాగ్స్తో ఆకట్టుకునే విజువల్స్ తో ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ఇట్ నెవర్ స్టాప్స్. ఒక్కడ్ని కూడా వదలను... అని నాగ్ అగ్రెసివ్ గా పలికే డైలాగ్ తో ట్రైలర్ ముగుస్తుంది.
యాక్షన్ తో పాటుగా ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ కంటెంట్ ఉందనే విషయం ఈ ట్రైలర్ లో స్పష్టం కనిపిస్తోంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఒక విలక్షణమైన సబ్జెక్ట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించే అన్ని అంశాలను ఈ చిత్రంలో ఉండేలా చూసుకున్నాడని తెలుస్తోంది. థ్రిల్లింగ్ సన్నివేశాలతో స్టైలిష్ మేకింగ్ తో ఆశ్చర్య పరిచాడు. డ్రగ్స్ అండ్ హ్యూమన్ ట్రాఫింగ్ పై ‘ది ఘోస్ట్’ కథాంశం ఉంటుందని అర్ధమవుతోంది. నాగార్జున పాత్ర ఇందులో సరికొత్తగా కనిపిస్తోంది. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అభిమానుల్ని అలరించే స్థాయిలో ఉన్నాయి. ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక ఈ మూవీలో సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. మలయాళ బ్యూటీ అనిఖా సురేంద్రన్, గుల్ పనాగ్, మనీష్ చౌదరి, జయప్రకాశ్, శ్రీకాంత్ అయ్యంగార్, రవివర్మ, బిలాల్ హుస్సేన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వరా సినిమాస్ ఎలెల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో సినిమా తెరకెక్కుతోంది. అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కాబోతోంది.