హిమాయత్ సాగర్ వద్ద ఘోర ప్రమాదం..

హిమాయత్ సాగర్ వద్ద ఘోర ప్రమాదం..

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ వద్దలో వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అటుగా వస్తున్న ఓ కారును బలంగా ఢీ కొట్టింది. దీంతో ‌కారులో ప్రయాణిస్తున్న  నలుగురికి తీవ్ర గాయాల్యాయి. 3 సంవత్సరాల చిన్నారి మృతి చెందింది. ఘటనను గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం అందించారు. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారందరిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాక్సిడెంట్ కు గురైన వారు పాతబస్తీకి చెందిన వారుగా గుర్తించామన్నారు. హిమాయత్ సాగర్ సర్వీసు రోడ్డులో ఘటన జరిందన్నారు. నలుగురిలో ఒక చిన్నారి మృతి చెందిందని మరొకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.