కాజీపేట రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం..

కాజీపేట రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం..

హనుమకొండ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాజీపేట రైల్వే స్టేషన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ బోగీ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. పొగలు కాస్త పెరిగి భారీ అగ్ని ప్రమాదానికి దారి తీసింది. మంటలు పెరుగుతూ పక్కనే ఉన్న మరో ప్యాసింజర్ రైలుకు అంటుకున్నాయి. ప్యాసింజర్ రైలులోని పలు భోగీలకు మంటలు అంటుకున్నాయి. దీంతో అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది.

 భయాందోళనకు గురైన ప్రయాణికులు రైల్వే స్టేషన్ నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రైల్వే పోలీసులు అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగేటప్పుడు రైలులో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని సిబ్బంది చెప్పారు.