వన్‌‌ప్లస్‌‌ ఫోన్లు అమ్మబోమంటున్న రిటైల్ చెయిన్లు

వన్‌‌ప్లస్‌‌ ఫోన్లు అమ్మబోమంటున్న రిటైల్ చెయిన్లు

న్యూఢిల్లీ: వన్‌‌ప్లస్‌‌ స్మార్ట్‌‌ఫోన్లను అమ్మబోమని  పెద్ద మొబైల్ రిటైల్‌‌ చెయిన్స్‌‌ నిర్ణయించుకున్నాయి. దీంతోపాటు వన్‌‌ప్లస్ ట్యాబ్లెట్లు, వేరబుల్స్‌‌ను కూడా  వచ్చే నెల 1 నుంచి  అమ్మకూడదని నిర్ణయించుకున్నాయని మనీకంట్రోల్‌‌ రిపోర్ట్ చేసింది.

ప్రాఫిట్ మార్జిన్స్ తక్కువగా ఉన్నాయని, వారెంటీలను ప్రాసెస్ చేయడంలో, సర్వీస్‌‌లను క్లయిమ్‌‌ చేసుకోవడంలో ఆలస్యం అవుతోందని రిటైల్‌‌ చెయిన్లు  పేర్కొన్నాయి.