కరోనా వ్యాప్తితో మద్రాస్ IIT మూసివేత

కరోనా వ్యాప్తితో మద్రాస్ IIT మూసివేత

చెన్నైలోని IITలో కరోనా కలకలం సృష్టించింది. క్యాంపస్ లో 774 మంది విద్యార్థులు ఉండగా, 66 మంది స్టూడెంట్స్ కు, ఐదుగురు సిబ్బందికి వైరస్ సోకింది. ఎవరి ద్వారా వచ్చిందో తెలియదుగానీ, ఒకే రోజులో 32 మంది వైరస్ బారిన పడ్డారు.  ఈ కేసుల సంఖ్య మరింతగా పెరగనుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఎవరి ద్వారా వచ్చిందో తెలియదుగానీ… తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ IITని మూసి వేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది.

IIT లోని అన్ని విభాగాలు, లైబ్రరీని వెంటనే మూసివేస్తున్నామని, అధ్యాపకులు, ఇతర సిబ్బంది, పరిశోధకులు, ప్రాజెక్టుల సిబ్బంది ఇంటి నుంచి పని చేయాలని సూచించామని అధికారులు తెలిపారు. క్యాంపస్ లో ఉన్న విద్యార్థులు, హాస్టల్ గదుల్లో మాత్రమే ఉండాలని, బయటకు రావద్దని, కరోనా నిబంధనలన్నీ పాటించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ ధరించాలని, భౌతికదూరాన్ని పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సర్క్యులర్ ను విడుదల చేశారు. విద్యార్థులు, సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే, వెంటనే వారు అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించింది IIT యాజమాన్యం.