హోటల్లో దారుణం..పనిచేసేవాడే ఓనర్ను హత్య చేశాడు

హోటల్లో  దారుణం..పనిచేసేవాడే ఓనర్ను హత్య చేశాడు

సికింద్రాబాద్: ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నమ్మిన వ్యక్తే చాయ్ హోటల్ ఓనర్ ను దారుణంగా చంపేశాడు. భోలక్ పూర్ మండి గల్లీ వద్ద ఉన్న మాలిక్ చాయ్ హోటల్ నిర్వాహకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హోటల్ నిర్వాహకుడు గౌస్ (50) ని హోటల్లో పనిచేసే వ్యక్తే  కత్తితో పొడిచాడు.చికిత్స కోసం గౌస్ ను గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.

విషయం తెలుసుకున్న ముషీరాబాద్ పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీం ద్వారా హత్యకు గల కారణాలు, వివరాలను సేకరించారు. గౌస్ ను హత్య చేసిన వ్యక్తి హోటల్ లో పనిచేసే ఫయాజ్ అహ్మద్ గా అనుమానిస్తు న్నారు. అతని కోసం పోలీసులు గాలస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.