నగర శివార్లలో గంజాయి రవాణా..

నగర శివార్లలో గంజాయి రవాణా..

అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న స్మగ్లర్లను మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 20లక్షలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను నేరేడ్‌మేట్ క్రాస్ రోడ్డు వద్ద అరెస్ట్ చేసారు ఎక్సైజ్ పోలీసులు. వారి వద్ద ఉన్న 140 కేజీల గంజాయి, 4 వేల నగదు, ఒక స్విఫ్ట్ డిజైర్ కారును స్వాదీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 20 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. వీరు ఈ గంజాయిని విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుండి కిలో 5 వేల రూపాయల చొప్పున కొనుక్కొచ్చి.. బయట 10 వేల రూపాయల వరకూ విక్రయిస్తారని తెలిపారు.