రైల్వే ఉద్యోగి మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

రైల్వే ఉద్యోగి మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
  • నిందితుడు ఆర్మీ జవాన్ శ్రీనివాసరెడ్డి.. మృతుడి భార్యకు వరుసకు బావగా గుర్తింపు
  • తాను పెళ్లి చేసుకోవాల్సిన మరదలిని పెళ్లి చేసుకున్నాడనే అక్కసుతోనే అదనుచూసి హత్య 
  • హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్లు ఉత్తరాఖండ్ వెళ్లి ఉద్యోగంలో చేరిన శ్రీనివాసరెడ్డి
  • ఉత్తరాఖండ్ వెళ్లి అరెస్టు చేసి తీసుకొచ్చిన మల్కాజ్ గిరి పోలీసులు

హైదరాబాద్: రైల్వే ఉద్యోగి విజయ్ కుమార్ మర్డర్ కేసును మల్కాజ్ గిరి పోలీసులు ఛేదించారు. నిందితుడు శ్రీనివాసరెడ్డి ఆర్మీ జవాన్. అంతేకాదు విజయకుమార్ భార్యకు వరుసకు బావగా గుర్తించారు. తాను పెళ్లి చేసుకోవాల్సిన మరదలిని పెళ్లి చేసుకున్నాడనే అక్కసుతోనే అదనుచూసి హత్య చేసినట్లు తేలింది. సంచలనం సృష్టించిన కేసు మిస్టరీని పోలీసులు శాస్త్రీయమైన ఆధారాలతో ఛేదించారు. 

ఈనెల 8వ తేదీన మల్కాజిగిరిలో రైల్వే ఉద్యోగి విజయ్ కుమార్ హత్య జరిగింది. కేసు నమోదు చేసుకున్న మల్కాజిగిరి పోలీసులు ఆధారాల కోసం తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు సీసీ ఫుటేజీలో నిందితుడి ఆధారాలు లభించాయి. తన మరదలి భర్త అయిన విజయ్ కుమార్ ను దారుణంగా చంపిన శ్రీనివాస రెడ్డి  హత్య చేసిన తరువాత ఏమి తెలియని వ్యక్తిగా ఉత్తరాఖండ్ రాష్టం డెహ్రాడూన్ కు వెళ్లిపోయి ఉద్యోగంలో చేరాడు. 

మృతుడు విజయ్ కుమార్ భార్యకు  పెళ్లికాకముందు బావ అయిన గుడ్ల శ్రీనివాస్ రెడ్డి ఆర్మీ ఉద్యోగికి పెళ్లి నిశ్చయం అయ్యింది. కానీ అనుకోని కారణాల వల్ల పెళ్లి రద్దు కావడంతో కక్షతో రగిలిపోయాడు. 5 సంవత్సరాలుగా అవకాశం కోసం వేచి చూసాడు. ఎలాగైనా విజయ్ కుమార్ ను చంపి తనకు దక్కాల్సిన మరదలిరి  పెళ్లి చేసుకోవాలని దురుద్దేశ్యంతో
 పథకం ప్రకారం అదును చూసి మృతుని ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో  విజయ్ కుమార్ ను అత్యంత దారుణంగా నరికి చంపాడు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు సిసి ఫుటేజ్ ను పరిశీలించి నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఆర్మీ జవాను గా గుర్తించి తను పని చేసే చోట అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.