డబ్బులు పంచిన మల్లారెడ్డి కాలేజ్ సిబ్బంది.. పట్టుకుని చితకబాదిన మహిళలు

డబ్బులు పంచిన మల్లారెడ్డి కాలేజ్ సిబ్బంది.. పట్టుకుని చితకబాదిన మహిళలు

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో భారీగా నగదు పంపిణీ జరుగుతుంది. పార్టీ లీడర్లు, వారి అనుచరులు డబ్బులు పంచుతూ.. దొరికిపోతున్నారు. తాజాగా సోమవారం(నవంబర్ 27) మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మోహన్ రావు నగర్ కాలనీలో మల్లారెడ్డి కాలేజ్ సిబ్బంది ఇంటింటికి డబ్బులు పంపిణీ చేస్తూ.. కాంగ్రెస్ నాయకులకు దొరికిపోయారు. దీంతో వారిని పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలు చితకబాదారు. 

మంత్రి మల్లారెడ్డి తన అనుచరులతో డబ్బులు పంపిణీ చేపిస్తున్నట్లు తెలిపారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి తమ నాయకునికి ఓట్లు వేయాలని డబ్బులు పంపిణీ చేస్తున్న వ్యక్తులను కాంగ్రెస్ నాయకులు జవహర్ నగర్ పోలీసులకు అప్పగించారు. 

మంత్రి మల్లారెడ్డి ఓడిపోతాననే భయంతో మేడ్చల్ లో డబ్బులు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. తెలంగాణ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నానని మంత్రి మల్లారెడ్డి చెప్పడమే.. తప్ప చేసే పనులేవి ఇక్కడ కనిపించడం లేవని విమర్శించారు. ఏం అభివృద్ధి చేయలేదు కాబట్టే.. ఎన్నికల సమయంలో ఓట్లు పడవనే భయంతో డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఎవ్వరు డబ్బులు పంచించినా.. ఏం చేసినా.. కాంగ్రెస్ వైపే ప్రజలు ఉన్నారని.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.