న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్ మేడిగడ్డ పర్యటనకు వెళ్తామంటున్నారని ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి విమర్శించారు. మేడిగడ్డకు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
కాళేశ్వరం కట్టి ఒక నష్టం చేస్తే, పాలమూరు– రంగారెడ్డిని విస్మరించి దక్షిణ తెలంగాణకు కేసీఆర్ మరింత నష్టం చేశారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ రీడిజైన్ వల్లే కాళేశ్వరం ప్రజలకు భారంగా మారిందన్నారు. కాళేశ్వరం తప్పులకు బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.