నందిగ్రామ్ నుంచే పోటీ చేస్తా: మమతా బెనర్జీ

నందిగ్రామ్ నుంచే పోటీ చేస్తా: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నట్లు తెలిపారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ. పదేళ్ల కిందట TMCకి అధికారం దక్కిందని…రైతు ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచిన నందిగ్రామ్ నుంచి తాను బరిలో దిగుతున్నానని మమత తెలిపారు. ఐదేళ్ల తర్వాత నందిగ్రామ్ లో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆమె..నందిగ్రామ్ తనకు బాగా కలిసొచ్చిన నియోజకవర్గమని స్పష్టం చేశారు. ఇటీవలే TMCని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి నియోజకవర్గం నందిగ్రామ్ కావడంతో మమత వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గత ఎన్నికల్లో మమత కోల్ కతాలోని భవానీపూర్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. భవానీపూర్ ప్రజలు బాధపడొద్దని, వారికి మంచి అభ్యర్థిని ఇస్తానని అన్నారు. అయితే ఆ తర్వాత చేసిన వ్యాఖ్యల్లో… తాను నందిగ్రామ్, భవానీపూర్ రెండు స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పారు. నందిగ్రామ్ తనకు పెద్దక్కులాంటిదన్నారు. భవానీపూర్ తన చిట్టిచెల్లెలు వంటిదన్నారు దీదీ. వీలైతే రెండు స్థానాల్లోనూ పోటీ చేస్తానని, ఒకవేళ సాధ్యం కాకపోతే భవానీపూర్ లో మరొకరు బరిలో దిగుతారని వివరించారు.