గర్భినిపై మానవ మృగం అత్యాచారం

గర్భినిపై మానవ మృగం అత్యాచారం

కరీంనగర్ జిల్లా : అత్యాచారం చేసిన వారిని ఎన్ కౌంటర్ చేస్తున్నా మానవ మృగాల్లో మార్పు రావడంలేదు. గర్భిని అని కూడా చూడకుండా మహిళపై అత్యాచారం చేశాడు ఓ దుర్మార్గుడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో వారం రోజులు క్రితం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో నివాసం ఉంటుంది ఓ మహిళ. ఆమె ఇప్పుడు నిండు గర్భిని. అయితే తనపై రామకృష్ణ అనే వ్యక్తి వారం రోజుల క్రితం అత్యాచారం చేశాడని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామంలో కేబుల్ బాయ్ గా పనిచేసే రామకృష్ణ ఇంట్లో టీవీ సరిగ్గా రావడం లేదని ఫోన్ చేస్తే వచ్చి..  ఒంటరిగా ఉన్న తనపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు తెలిపింది మహిళ.

అయితే ఘటన జరిగిన రోజే రామకృష్ణను పట్టుకుని స్థానికులు, బంధువులు చితకబాదారు. ఫ్యామిలీ పరువు పోతుందనే కారణంగా వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే తనను కొట్టారంటూ రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తనపై  జరిగిన లైంగిక దాడిని వివరించడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకుని వీరిద్దరినీ వైద్య పరీక్షల కోసం కరీంనగర్ లోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి పంపించారు. ప్రస్తుతం వారు హస్పిటల్ లో ఉన్నారని రిపోర్ట్స్ రాగానే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుపుతామన్నారు పోలీసులు.