
చెన్నై: తమిళనాడుకు చెందిన ఒక యాచకుడు కరోనా సహాయ నిధికి రూ. లక్ష విరాళం ఇచ్చాడు. దీంతో సమాజం పట్ల అతడి ఔదర్యాన్ని ప్రశంసించిన కలెక్టర్.. సామాజిక కార్యకర్త అనే బిరుదుతో అతడిని సత్కరించారు. మదురైకు చెందిన పూల్ పాండియన్ అనే వ్యక్తి యాచిస్తూ జీవిస్తున్నాడు. కరోనా మహమ్మారితో పలువురు మరణించడాన్ని చూసి అతడు చలించిపోయాడు. దీంతో తన వంతు సహాయంగా మే నెలలో రూ. పది వేల విరాళం ఇచ్చిన పాండియన్.. గత మూడు నెలల్లో భిక్షాటన ద్వారా సేకరించిన మరో రూ.90 వేలు మంగళవారం మదురై కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి, ఆ డబ్బును కరోనా నిధికి విరాళంగా ఇచ్చాడు.
దీంతో సమాజం పట్ల పూల్ పాండియన్ బాధ్యతను మెచ్చుకున్న జిల్లా కలెక్టర్.. ఆయనను సామాజిక కార్యకర్తగా పేర్కొంటూ ఒక ప్రశంసా పత్రాన్ని అందజేశారు. దీంతో పాండియన్ పట్టరాని ఆనందం వ్యక్తం చేశాడు. జిల్లా కలెక్టర్ తనకు సామాజిక కార్యకర్త అన్న బిరుదు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు.
Tamil Nadu: Poolpandiyan, an alms seeker in Madurai, today donated Rs 90,000 towards the state #COVID19 relief fund. He says, "I am happy that the District Collector has given me the title of a social worker."
In May this year, he donated Rs 10,000 towards the same cause. pic.twitter.com/UzA9EVUBWf
— ANI (@ANI) August 18, 2020