చెట్టుకు కట్టేసి.. కత్తితో పొడిచి..

చెట్టుకు కట్టేసి.. కత్తితో పొడిచి..

పర్వతగిరి(సంగెం), వెలుగు: వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలో శుక్రవారం ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పర్వతగిరి సీఐ విశ్వేశ్వర్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హంస సంపత్(58) నాలుగు రోజుల కింద ఊరికి వెళ్లి, గురువారం ఇంటికి తిరిగి వచ్చాడు. రాత్రి ఇంటి బయట నిద్రించగా.. శుక్రవారం ఉదయం తన భార్య సుగుణ లేచి చూసేసరికి సంపత్ చనిపోయి కనిపించాడు. దుండగులు పక్కనే ఉన్న చెట్టుకు కట్టేసి, గొంతులో కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంపత్ కొడుకు అశోక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఎంక్వైరీ చేస్తున్నారు. కాగా, ఈ హత్యకు  తన భర్త తమ్ముడే కారణమని, కొన్నాళ్లుగా తమకు భూతగాదాలు నడుస్తున్నాయని సుగణ ఆరోపించింది.