మద్యం మత్తులో ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌ను చంపేసిన్రు

మద్యం మత్తులో ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌ను చంపేసిన్రు


పాల్వంచ రూరల్, వెలుగు : మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు తమ ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌ను కొట్టి చంపారు. తర్వాత మృతదేహాన్ని అక్కడే పూడ్చి వేసి, ప్రమాదంలో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. చివరికి స్థానికులకు అనుమానం రావడంతో హత్య విషయం బయటపడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో శుక్రవారం వెలుగుచూసింది. పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామపంచాయతీ బంజర గ్రామ పరిధిలోని కుంజా వెంకయ్య గుంపునకు చెందిన కల్తీ మల్లయ్య(47), జోగా రాము, పూనెం శివ  స్నేహితులు. ముగ్గురు కూలీ పనులు చేసుకొని జీవిస్తున్నారు. గురువారం రాత్రి గ్రామ సమీపంలో ముగ్గురు కలిసి మద్యం తాగారు. 

మద్యం మత్తులో ఉండగా ముగ్గురి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో జోగా రాము కర్రతో మల్లయ్య తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ మల్లయ్య స్పాట్‌‌‌‌‌‌‌‌లోనే చనిపోయాడు. దీంతో రాము, శివ కలిసి అక్కడే గుంత తీసి మల్లయ్యను పూడ్చివేశారు. శుక్రవారం తెల్లవారుజామున గ్రామానికి వచ్చి రాత్రి జరిగిన ప్రమాదంలో మల్లయ్య చనిపోయాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు చెప్పారు. అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పాల్వంచ రూరల్‌‌‌‌‌‌‌‌ ఎస్సై శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ గ్రామానికి వచ్చి పూడ్చిన మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించిన అనంతరం పోస్టుమార్టంకు పంపించారు. అలాగే రాము, శివను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు.