రిహాబిలిటేషన్ సెంటర్ లో దారుణ హత్య

రిహాబిలిటేషన్ సెంటర్ లో దారుణ హత్య

తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఆశా ఆఫీసర్స్‌ కాలనీలోని రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల క్రితం నలుగురు వ్యక్తులు గొడవ పడ్డారు. అది మనసులో పెట్టుకున్న మిగతా ముగ్గురు ఓ వ్యక్తిని గొంతు కోసి హత్య చేశారు. రిహాబిలిటేషన్‌ సెంటర్‌ నుంచి బయటికి వెళ్లేందుకే ఈ ముగ్గురు వ్యక్తులు హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా.. వీరుంటున్న రిహాబిలిటేషన్ సెంటర్ అక్రమంగా నడుపుతున్నట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఈ ఘటనపై నోరుమెదపడం లేదు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.