బొగ్గు గనుల పరిసరాల్లో లిక్కర్​ పార్టీలు బంద్..సర్క్యూలర్​ జారీ చేసిన సింగరేణి యాజమాన్యం

బొగ్గు గనుల పరిసరాల్లో లిక్కర్​ పార్టీలు బంద్..సర్క్యూలర్​ జారీ చేసిన  సింగరేణి యాజమాన్యం

కోల్​బెల్ట్​, వెలుగు: సింగరేణి బొగ్గు గనులు, డిపార్ట్​మెంట్ల​ఆవరణల్లో మందు పార్టీలు చేసుకోవద్దంటూ సోమవారం శ్రీరాంపూర్​ ఏరియా సింగరేణి యాజమాన్యం సర్క్యూలర్​ జారీ చేసింది.  ఎగ్జిక్యూటివ్ లతో సహా కొందరు ఉద్యోగులు మందు పార్టీలు చేసుకుంటున్నారని ఇది దుష్ప్రవర్తన కిందకు వస్తుందని పేర్కొంది. గనులు, డిపార్ట్​మెంట్ల పరిసరాల్లో మందు పార్టీలు చేసుకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  

ALSOREAD:ఈ నెల 28 నిజామాబాద్ లో జగన్నాథ రథయాత్ర

బొగ్గు గనులు, డిపార్ట్​మెంట్లపై ఉన్న మైసమ్మ తల్లి ఆలయంలో  కోళ్లు, మేకలు కోసి, ఉద్యోగులు సామూహిక విందు చేసుకోవడం, మందు తాగడం ఆనవాయితీగా వస్తుందని టీబీజీకేఎస్​ కేంద్ర కమిటీ వైస్​ ప్రెసిడెంట్​ డీకొండ అన్నయ్య, శ్రీరాంపూర్​ ఏరియా బీఎంఎస్ సెక్రటరీ నాతాడి శ్రీధర్​రెడ్డి అన్నారు.  పూజా కార్యక్రమాలను నిర్వహించవద్దని సింగరేణి యాజమాన్యం సర్క్యూలర్​ చేయడం వారి మనోభావాలను దెబ్బతీయడమేని, వెంటనే సర్క్యూలర్​ను ఉపసహంరించుకోవాలని డిమాండ్​ చేశారు.