MRPS కార్యకర్తలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలి

MRPS కార్యకర్తలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలి

టీఎస్ ఆర్టీసీ లాభాల్లోకి వచ్చేలా ఈ రోజునుంచి ప్రతీ ఎమ్మార్పీఎస్ కార్యకర్తా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలని MRPS చీఫ్ మందకృష్ణ మాదిగ అన్నారు. యాదాద్రిలో మాట్లాడిన ఆయన… లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రాలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయగా లేనిది… మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో ఎందుకు సాధ్యం కావడంలేదని ప్రశ్నించారు. సోమవారం.. ఏపీ సీఎం జగన్ తో జరిగిన కేసీఆర్ భేటీని ప్రస్తావిస్తూ…. ఉద్యమాల విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉండాలని… అమరావతి విషయంలో కూడా జగన్ ను కఠినంగా వ్యవహరించమని కేసీఆర్ చెప్పడాన్ని తాము ఖండిస్తున్నామని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ మైనార్టీలపై జరుగుతున్న హత్యలు, హత్యాచారాలకు నిరసనగా ఎల్లుండి నుంచి మార్చి వరకు 119 నియోజకవర్గాల్లో చేపట్టనున్న యుద్ధభేరి రథయాత్రను బస్సుయాత్రగా మారుస్తున్నట్లు మంద కృష్ణ తెలిపారు. తామంతా 90శాతం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ యుద్ధభేరి సన్నాహక సదస్సులను నిర్వహిస్తామని ఆయన తెలిపారు.