మార్కెట్‌‌‌‌కు పోటెత్తిన మామిడి

మార్కెట్‌‌‌‌కు పోటెత్తిన మామిడి

మార్కెట్లకు మామిడి రాక మొదలైంది. ఈ ఏడాది పూత నెల రోజులు ఆలస్యంగా రావడంతో మామిడిపండ్లు ఇప్పుడిప్పుడే మార్కెట్‌‌‌‌కు వస్తున్నాయి. కరీంనగర్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో నాలుగైదు రోజులుగా మామిడి దిగుమతి పెరిగింది. కిలో రూ. 60 ఉండగా రిటైల్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో రూ.100 వరకు అమ్ముతున్నారు. ఈ ఏడాది సీజన్‌‌‌‌ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ దిగుమతులు పెరుగుతాయని, జూన్‌‌‌‌ చివరి వరకు సీజన్ కొనసాగే ఛాన్స్‌‌‌‌ ఉందని వ్యాపారులు చెబుతున్నారు.