రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉంది : మాణిక్ రావ్ ఠాక్రే

రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉంది : మాణిక్ రావ్ ఠాక్రే

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ఎవరితో పొత్తు తమకు  అవసరం లేదని తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తుపై ఎక్కడా కూడా చర్చ జరగలేదని ఆయన అన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ కొత్త నాటకం ఆడుతుందని విమర్శించారు. రాష్ట్రంలో వైఫల్యం చెందితేనే పక్క రాష్ట్రాల్లో పోటీ చేయాలనే ఆలోచనలు వస్తాయన్నారు.  

రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా  బీఆర్ఎస్ నెరవేర్చలేదని మాణిక్ రావ్ ఠాక్రే  చెప్పారు. అబద్ధపు వాగ్దానాలను ఎండగట్టేందుకు ప్రజలకు కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందని తెలిపారు. హాత్ సే హాత్ జోడో యాత్రను పెద్దఎత్తున విజయవంతం చేయాలని  నాయకులను, ప్రజలను  మాణిక్ రావ్ ఠాక్రే కోరారు. హాత్‌ సే హాత్‌ జోడో కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6న ప్రారంభించనున్నారు. భద్రాచలంలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధిష్టానం నిర్ణయించింది.