మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి నో వర్క్ నో పే సర్క్యులర్ అమలు..

మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి నో వర్క్ నో పే సర్క్యులర్ అమలు..

మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరైన సరే కారణం లేకుండా ఆఫీసుకు రాకపోతే ఆబ్సెంట్‌ వేసి ఆ రోజు వేతనాన్ని జీతం నుంచి కట్ చేస్తామని ప్రభుత్వం సర్య్కులర్ జారీ చేసింది. ఈ మేరకు ‘నో వర్క్-నో పే’ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు శాతం గణనీయంగా పడిపోతుందని అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

 ప్రభుత్వం అధికారులను డిప్యూటీ కమిషనర్లు,లైన్ డిపార్ట్‌మెంట్లు, ఫీల్డ్ లెవల్ కార్యాలయాలకు అటాచ్ చేస్తామని మణిపూర్ సీఎస్ వినీత్ జోషీ ప్రకటించారు. అక్కడి నుంచి అధికారులు విధులు నిర్వహించుకోవచ్చని సూచించారు. అటాచ్ చేసిన అధికారులు సంబంధిత కార్యాలయాలకు వెళ్లడం లేదని, విధులకు హాజరుకావడం లేదని తెలిసిందని, ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

 డిప్యూటీ కమిషనర్ అధికారుల అటెండన్స్ కు సంబంధించిన రికార్డును రోజు పరిశీలించాలని సూచించారు. ఎవరైన అధికారులు మాట వినకుండా ఉంటే వారి జీతం కట్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హింసాత్మక దాడులు ముగిసే వరకు ఈ సర్క్యులర్ కొనసాగనున్నట్టు సమాచారం.