వేలంలో రూ.99,999 పలికిన కిలో టీ పొడి

వేలంలో రూ.99,999 పలికిన కిలో టీ పొడి

గౌహతి : అసోం టీ పొడి మరోసారి రికార్డు క్రియేట్ చేసింది. దిబ్రూఘడ్ జిల్లాలో పండించిన మనోహరి గోల్డ్ టీ పొడి వేలంలో కిలో రూ. 99,999 పలికింది. గత రికార్డుల్ని బ్రేక్ చేసింది.  గౌహతి టీ యాక్షన్ సెంటర్ లోని సేల్ నెంబర్ 50 వద్ద మనోహరి గోల్డ్ టీని వేలం వేశారు. స్థానిక హోల్ సేల్లర్ సౌరవ్ టీ ట్రేడర్స్ అత్యధిక బిడ్డింగ్ వేసి దాన్ని సొంతం చేసుకున్నారు. గతేడాది మనోహరి గోల్డ్ టీ కిలో రూ.75 వేలు పలకగా.. 2019లో కిలో రూ.50 వేలకు అమ్ముడుపోయింది. 
మనోహరి రకం తేయాకును ప్రత్యేకంగా సేకరిస్తారు. మిగతా టీ పొడుల మాదిరిగా దీన్ని ఆకుల నుంచి కాకుండా మొక్కల నుంచి మొగ్గలను సేకరించి టీ పొడి తయారు చేస్తారు. మే - జూన్ నెలల్లో తెల్లవారు జామున ఈ మొగ్గలను సేకరిస్తారు. ఇది చాలా కష్టంతో కూడిన ప్రక్రియ అయినందున మనోహరి రకం అంత ధర పలుకుతుంది. ఈ టీ పొడికి అత్యధిక డిమాండ్ ఉండగా.. ఉత్పత్తి మాత్రం చాలా తక్కువగా ఉంది.