ఎన్​కౌంటర్​లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేశ్ గన్​మెన్ ​మృతి

ఎన్​కౌంటర్​లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేశ్ గన్​మెన్ ​మృతి

భద్రాచలం,వెలుగు : ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని ధమ్తరీ జిల్లా నగరి పోలీస్ స్టేషన్ పరిధిలోని భైంసా ముండా అడవుల్లో శనివారం జరిగిన ఎన్​కౌంటర్​లో మృతి చెందిన మావోయిస్టును గుర్తించారు. కేంద్ర కమిటీ సభ్యుడు గణేశ్​కు గన్​మెన్​గా వ్యవహరించే మడకం మంగళ్​ అలియాస్​ అశోక్​గా పోలీసులు ప్రకటించారు. బీజాపూర్​ జిల్లా గంగలూరు పోలీస్​స్టేషన్ పరిధిలోని కర్కా గ్రామవాసి అని పోలీసులు తెలిపారు. 

ఇతడిపై రూ.5 లక్షల రివార్డు ఉంది. భారీగా మావోయిస్టులు సమావేశమయ్యారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్​కు వెళ్లాయి. 20 మంది మావోయిస్టులు పోలీసులను చూసి కాల్పులు జరుపుకుంటూ పారిపోయారు. కాల్పులు ఆగిపోయాక ఘటనాస్థలానికి వెళ్లి చూడగా అశోక్​ మృతదేహంతో పాటు 315 బోర్​ తుపాకీ, మొబైల్​ ఫోన్​, రెండు బ్యానర్లు, విప్లవ సాహిత్యం కనిపించగా, వాటిని స్వాధీనం చేసుకున్నారు.