హైదరాబాద్ లో దారుణం.. పెళ్లైన రెండు నెలలకే నవ వధువు ఆత్మహత్య

హైదరాబాద్ లో దారుణం.. పెళ్లైన రెండు నెలలకే నవ వధువు ఆత్మహత్య

హైదరాబాద్  లాంగర్ హౌస్ పరిధిలోని బాపూ నగర్ లో దారుణం జరిగింది. పెళ్లై రెండు నెలలు కాకముందే నిఖిత అనే నవ వధువు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే తన కూతురిది ఆత్మహత్య కాదని అత్తింటివారు ఉరివేసి చంపారని ఆరోపిస్తున్నారు మృతురాలి తల్లిదండ్రులు. వాళ్ల బావ వెంకటరమణ తనని వేధిస్తున్నాడని తన కూతురు ఫోన్ లో పలుమార్లు చెప్పిందన్నారు. తమకు న్యాయం జరగాలంటూ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆందోళనకు దిగారు మృతురాలి బంధువులు. కేసు నమోదు చేసుకున్న లంగర్ హౌస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వర్క్  ఫ్రమ్ హోమ్.. వద్దు గురూ..! ఆఫీసే బెటర్ అంటున్న ఎంప్లాయీస్