మారుతీ సుజుకీ స్విఫ్ట్ ధరలు 25 వేల వరకు పెంపు

మారుతీ సుజుకీ స్విఫ్ట్ ధరలు 25 వేల వరకు పెంపు

న్యూఢిల్లీ: ఎస్​యూవీ గ్రాండ్ విటారా (కొన్ని వేరియంట్లు)తోపాటు హ్యాచ్‌‌బ్యాక్ స్విఫ్ట్ ధరలను  పెంచినట్లు మారుతీ సుజుకి బుధవారం తెలిపింది. గ్రాండ్ విటారా  సిగ్మా వేరియంట్ ధరను రూ.19 వేలు, స్విఫ్ట్​ధరను రూ.25 వేలు పెంచినట్లు కంపెనీ తెలిపింది. 

ఇప్పుడు, స్విఫ్ట్ ధర రూ. 5.99 లక్షల నుంచి రూ. 8.89 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉంటుంది. గ్రాండ్ విటారా  సిగ్మా వేరియంట్ ధర రూ. 10.8 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ధరల పెంపుదల ఈనెల పదో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.